జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని మరో మూడు నెలలు పాటు జూన్ 1, 2025 నుండి ఆగష్టు 31, 2025 వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం గానీ ఏది ముందు జరిగితే అప్పటివరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్ల గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మే 31 నాటికి అక్రిడిటేషన్ కార్డులుపనిచేస్తున్న పాత్రికేయులకు మాత్రమే మరో మూడు నెలలు జూన్ 1, 2025 నుండి ఆగష్టు 31, 2025 వరకు ఈ పొడిగింపు సౌకర్యం వర్తిస్తుందని ఆ ప్రకటనలో సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్ల తెలియజేశారు